టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులాంటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. అయితే తమిళ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. మరో పక్కన బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ఇక ప్రస్తుతం హిందీలో వరుణ్ దావన్కు జంటగా కీర్తి సురేష్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఆ సినిమా కంటే ముందే అజయ్ దేవగన్ తో కలిసి మరో బాలీవుడ్ సినిమా మైదాన్ లో కీర్తి నటించాల్సి ఉంది.. కానీ మేకర్స్ చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్లో ఆమెను తప్పించి ప్రియమణితో షూటింగ్ మొదలుపెట్టారు. అయితే తాజాగా మైదాన్ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ అమిత్ శర్మ ఈ విషయాని వివరించాడు. ఆయన మాట్లాడుతూ మైదాన్ సినిమాలో అబ్దుల్ రహీం పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నారని.. ఆయన భార్య పాత్రలో మొదటి కీర్తి సురేష్ అని అనుకున్నాం.
ఆ పాత్ర సినిమాకు ఎంత ప్రత్యేకం అందుకే కీర్తితో ఈ పాత్ర చేయించాలని భావించాం.. కానీ ఆ టైంలో కీర్తి సురేష్ చాలా బరువు తగ్గి సన్నగా మారారు.. దీంతో ఆ పాత్రకు ఆమె సెట్ కారనిపించింది వెంటనే ప్రియమణీతో ఆ సినిమాని చేసాం అంటూ ఆయన వివరించాడు. మైదాన్ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కీర్తి సురేష్ కేవలం బరువు పెరగడం కారణంగా ఇలాంటి భారీ ఆఫర్ మిస్ చేసుకుందన న్యూస్ నెటింట వైరల్ అవ్వడంతో అనవసరంగా ఆ తప్పు కీర్తి సురేష్ కు భారీ లాస్ట్ తెచ్చి పెట్టింది అంటూ అంత తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.