మహేష్ బాబు – వి.వి.వినాయక్ కాంబోలో సినిమా రాకపోవడానికి కారణం అదేనా.. సెక్రెటరీ రివీల్ చేసిన డైరెక్టర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్న ఆది సినిమాతో ఇండస్ట్రీకి ప‌రిచ‌య‌మైన వి.వి.వినాయక్‌ లాంటి విభిన్నమైన దర్శకులు మాత్రం ఎక్క‌డ ఉండ‌ర‌న‌టంలో సందేహంలేదు. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ సాధించడంతో భారీ పాపులారిటీ ద‌క్కించుకున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న వి.వి.వినాయక్, చిరంజీవితో తర్కెక్కించిన ఠాగూర్. ఎన్టీఆర్‌తో రూపొందించిన ఆది, అదుర్స్.. రవితేజతో తీసిన కృష్ణలాంటి సినిమాలు ఆయన కెరీర్ లోనే సూపర్ హిట్లుగా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం ఎటువంటి సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న వినాయ‌క్ ఎక‌పుడు దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలంద‌రితో సినిమాలు తీసిన‌ సంగతి తెలిసిందే.

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వినాయక్‌ మాట్లాడుతూ మహేష్ బాబుతో సినిమా ఇప్పటివరకు రాకపోవడానికి గల ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. అదుర్స్ సినిమా తర్వాత వినాయక్‌.. మహేష్ బాబుతో సినిమా చేయాలని భావించారట. కానీ అది అనుకోని కారణాలతో ఆగిపోయింది. ఇక ఈ సినిమాకి ఆకుల శివ కథను కూడా అందించార‌ట‌. అయినా ఈ ప్రాజెక్ట్ అస‌లు వర్కౌట్ కాలేదు. తర్వాత మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వినాయక్‌కి రాలేదట. అందువల్ల మహేష్, వినియ‌క్‌ కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఒక మూవీ కూడా రాలేదు.

VV Vinayak is all set to turn producer

ఇక స్టార్ హీరోలు అందరితో సినిమాలను చేసిన వి.వి.వినాయక్ ఒక మహేష్‌తో మాత్రమే సినిమా చేయకపోవడం పెద్ద లోటుగా ఆయన ఫీల్ అవుతారట. ఈ విష‌యాని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు లాంటి స్టార్ హీరో వి.వి.వినాయక్‌కు డేట్స్ ఇచ్చే అవకాశాలు కూడా లేవనే చెప్పాలి. కనుక వినాయ‌క్‌ కెరీర్ లో ఇకపై మహేష్ బాబుతో సినిమా చేయబోయేది కూడా లేదు. ఇక ప్రస్తుతం డైరెక్టర్గా ఫేడ్అవుట్ అయ్యాడు కానీ ఆయన ఏదో ఒక సినిమా తెరకెక్కించి సక్సెస్ కొడితే మాత్రం మళ్లీ త్రో బ్యాక్‌ కావడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.