డైరెక్షన్ మానేసి పూరి జగన్నాధ్ ఆ పని చేయబోతున్నాడా..? ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్. ఇప్పుడు అంటే ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సి వస్తుంది.. కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో ఊగిపోయేవారు మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ – రవితేజ లాంటి స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చింది పూరి జగన్నాథ్ అన్న సంగతి మర్చిపోకూడదు .

 

ఒక బద్రి.. ఒక ఇడియట్ .. ఒక అమ్మానాన్న తమిళ అమ్మాయి లాంటి సినిమాలను తెరకెకించిన పూరీ జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. నమ్మి ఒక్కరంటే ఒక్క హీరో కూడా అవకాశము ఇవ్వలేకపోతున్నారు . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ డైరెక్షన్ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది .

పూరి జగన్నాథ్ డైరెక్షన్ కి టోటల్ గా గుడ్ బై చెప్పేసి నటన వైపు మల్లాలి అని చూస్తున్నారట . ప్రజెంట్ డబల్ ఇస్మార్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను తెరకెక్కించాలి అని డిసైడ్ అయ్యారట . ఈ సినిమా తెరకెక్కిం చేసిన వెంటనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి నటుడుగా కొత్త జీవితం ప్రారంభించాలని ట్రై చేస్తున్నారట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు..!