ఎన్టీఆర్ అంటే గీతామాధురి కి ఇంత పిచ్చా..? కొడుకుకి ఏం పేరు పెట్టిందో తెలుసా..?

గీతా మాధురి.. ఇండస్ట్రీలో ఓ స్టార్ సింగర్. ఆమె పాట పాడితే మనసుకు చాలా హాయిగా ఉంటుంది అంటూ ఉంటారు జనాలు. ఎటువంటి పాటలు అయినా సరే అవలీలగా పాడి మెప్పించగలిగే గీతామాధురి .. రీసెంట్గా పండు లాంటి బాబుకు జన్మనిచ్చింది . ఇటీవల గీతామాధురి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10న తమకు బాబు పుట్టాడు అని నందు గీతామాధురి అఫీషియల్ గా తెలిపారు .

రీసెంట్గా ఆ బాబుకి పేరు పెట్టారు . ఆ పేరుని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు గీతా-నందు. బాబుకు పెట్టిన పేరు చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. మనకు తెలిసిందే నందమూరి ఫ్యామిలీకి బిగ్ ఫ్యాన్ గీతామాధురి . బాలయ్య – ఎన్టీఆర్ అంటే ఆమెకు చాలా చాలా ఇష్టం. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . జై బాలయ్య సాంగ్ పాడింది కూడా గీతామాధురినే..

ఆ సాంగ్ పాడుతూ ఆమె ఎంత ఎంజాయ్ చేసిందో మనకు తెలుసు . తన కొడుకుకి “ధృవ్ ధీర్ తారక్” అనే పేరును పెట్టుకొచ్చింది . నందమూరి ఫ్యామిలీ పై ఉన్న అభిమానంతోనే ఈ విధంగా పేరుని పెట్టింది అంటున్నారు అభిమానులు . దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. గీతా మాధురి ప్రజెంట్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది . నందు పలు సినిమాల కోసం ట్రై చేస్తున్నాడు . ఈ జంటకి జనాలు శుభాకాంక్షలు చెబుతున్నారు . ఫ్యూచర్లో నందు మంచి మంచి హిట్స్ కొట్టాలి అని బ్లెస్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri)