నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను.. కంటతడి పెట్టుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సందీప్ కిషన్..!

టాలీవుడ్ లో ఇప్పుడప్పుడే ఇదుగుతూ మంచి ప్రశంసలు అందుకుంటున్న హీరోలలో సందీప్ కిషన్ కూడా ఒకరు. ఇటీవలే భైరవకోన సినిమాతో ప్రేక్షకులం ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు సందీప్ కిషన్. ప్రస్తుతం వరుస సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు. ఒక పక్క సందీప్ కిషన్ సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క ప్రతి ఇన్సిడెంట్ పై స్పందిస్తూ ఉంటాడు. ఇక తాజాగా హో ట్వీట్ పెట్టాడు.

ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి ఈయనకు చెస్ట్లో పెయిన్ రావడంతో తీవ్ర అస్వస్థకు గురైన ఈయన ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఈయన అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. అయితే 40 8 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన డేనియల్ మరణంపై తాజాగా అనేకమంది సెలబ్రిటీస్ స్పందించారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ట్వీట్ ద్వారా స్పందించాడు. ” నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు డానియల్ అన్న నాకు అండగా నిలిచారు. నాతో ఎప్పుడూ దయగా ఉండే వ్యక్తి ఆయనే. నటన పట్ల నా అభిరుచి తెలుసుకున్న ఆయన తన పలుకుబడి ఉపయోగించి మరి నన్ను చాలా ఆడిషన్స్కు పంపించారు. నీ అందమైన మనసును, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను అన్న. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ” అంటూ రాసుకు వచ్చాడు సందీప్ కిషన్. ప్రస్తుతం ఈయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.