హమ్మయ్య..ఎట్టకేలకు తెలుగు సినిమాకి సైన్ చేసిన పూజా హెగ్డే.. ఇక ఆల్ హ్యాపీస్..!

పూజ హెగ్డే .. టాలీవుడ్ బుట్ట బొమ్మగా అందరికీ సుపరిచితురాలే .. కానీ రీసెంట్ కాలంలో పూజా హెగ్డే ఎలాంటి ట్రోలింగ్ ఎదుర్కొందో కూడా అందరికీ తెలుసు . అయితే ఫైనల్లీ ఎట్టకేలకు ఆమె అద్భుతమైన ఆఫర్ ని అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత పూజా హెగ్డే కెరియర్ ఎలా మారిపోయిందో మనకు తెలిసిందే . అయితే రీసెంట్ గా పూజా హెగ్డే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ నటించబోతున్నాడట. తెరపై అల్లు అర్జున్ పూజ హెగ్డే కాంబో ఎంత బాగుంటుందో ఎన్నిసార్లు చెప్పుకున్న తక్కువే . వీళ్ళ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి . ముచ్చటగా మూడోసారి వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది అని తెలిసి అభిమానులు సంతోషంగా ఉన్నారు . ఇక పూజ హెగ్డే కెరియర్ ఆల్ హ్యాపీస్ కాబోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

అట్లీ మొదటి నుంచి హీరోయిన్స్ అందం విషయం పెద్దగా పట్టించుకోడు . టాలెంట్ చూస్తాడు .. అందుకే పూజాకి ఆఫర్ ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. కాగా ప్రెసెంట్ అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . కొన్ని కారణాల చేత ఈ సినిమా షూట్ వాయిదా పడింది అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తూ ఉండగా ఐటెం సాంగ్ లో దిశాపటాని నటించబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!