“నా జీవితంలో నేను తీసుకున్న కఠినమైన నిర్ణయం అదే”..మనసులోని బాధను బయటపెట్టిన సమంత..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత పేరు ఎప్పుడూ మారుమ్రోగిపోతూనే ఉంటుంది . గతంలో అంటే వేరే.. ఆమె పేరు ఎక్కువగా పాజిటివ్ విషయాలకే ట్రెండ్ చేసే వాళ్ళు . ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆమె పేరు నెగిటివ్ గా ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ను ఓ రేంజ్ లో ఎకేస్తున్నారు .

మీమ్ తో ట్రోల్స్ తో ఆమె పర్సనల్ విషయాలను కూడా బహిరంగంగా చెప్పుకొస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత వాటిపై స్పందించింది. ” జీవితంలో నేను తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం అదే ..మన విషయాలు పక్కవాళ్ళకి చెప్పకూడదు.. ఎవరిని గట్టిగా నమ్మకూడదు. నా లైఫ్ లో నేను తీసుకున్న మంచి డెసిషన్ ఇదే అనుకుంటున్నాను ..ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకూడదు అని డిసైడ్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది”.

అంతేకాదు సమంత మీమ్‌స్ – ట్రోల్స్ పై స్పందిస్తూ అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోను అని.. మొదట్లో బాధపడ్డాను కానీ ఆ తర్వాత లైట్ గా తీసుకున్నాను అని క్లారిటీ ఇచ్చింది .ప్రజెంట్ సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది . మంచి మంచి స్క్రిప్స్ వస్తే ఎటువంటి సినిమాలల్లో అయినా నటించడానికి సిద్ధమంటూ కూడా చెప్పుకొచ్చింది..!!