హీరో శరత్ బాబు నేను కలిసి పిల్లల్ని కూడా కనాలనుకున్నాం.. సీనియర్ యాక్ట్రెస్ జయలలితా సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీనియ‌ర్ న‌టి జయలలిత. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక గతంలో ఎక్కువగా వ్యాంప్ పాత్రలో గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. బుల్లితెరపై పలు సీరియల్స్ లోను సందడి చేస్తుంది. బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం లాంటి సీరియల్స్ జయలలిత నటిస్తుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె దివంగత నటుడు శరత్ బాబు, గుమ్మడితో తనకున్న రిలేషన్ గురించి వివరించింది. మీ జీవితంలో గుమ్మడి గారు ఎంతో ప్ర‌త్యేకం. అంతలా ఆయనతో మీరు క‌నెక్ట్ అవ్వ‌డానికి కారణమేంటి అని జయలలితను ప్రశ్నించగా.. దానికి సమాధానం చెబుతూ.. నాకోసం సుల అనే ఓ వైన్ బాటిల్ ని రోజు తెప్పించే వారిని.. అప్పట్లో అది రూ.800. ఇది నీకే ఇది కేవలం జయమ్మకే.. వేరే ఎవరు ముట్టుకోవద్దని చెప్పేసి వెళ్లిపోయేవారిని వివ‌రించింది.

ఒక ఐదు సంవత్సరాలు మా జర్నీ కంటిన్యూ అయిందని.. ఇప్పటికే అటు నుంచి వెళ్ళుతూ ఆ ఇల్లు చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది అంటూ వివరించింది. అయినా చనిపోయాక అక్కడ నుంచుని ఏడుస్తుంటే ఆయన పిల్లల్ని పలకరిస్తూజ‌జ‌ నా భుజం తట్టి నాగేశ్వరరావు గారు నన్ను ఓదార్చరంటూ జయలలిత ఎమోషనల్ అయిందిజ‌ మొదటి పెళ్ళి, బ్రేకప్ తర్వాత ప్రేమ, పెళ్ళిపై ఆసక్తి పోయిందని.. మళ్లీ వాటి వైపు వెళ్ళలేదంటూ వివ‌రించింది. ఎవరి తోడు అవసరం లేదనిపించింది అంటూ.. ఊయుకుంటాం, రెండో పెళ్లి చేసుకుంటాం అని తర్వాత ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు.. కానీ భగవంతుడు నన్ను అటువైపు వెళ్ళనివ్వలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

అన్నపూర్ణమ్మ వాళ్ళంతా కనీసం ఒక బిడ్డనైనా దత్తత తీసుకోమ‌ని సజెషన్ ఇచ్చారని.. అక్క పిల్లలు ఉన్నారు కదా అనుకునేదాన్ని అంటూ వివరించింది. ఇక శరత్ బాబుది నాది మనసు బంధం. నేను కాస్త గట్టిగా అనుకున్నాను.. ఆయన కొంచమే అనుకుని వదిలేసారు. ఆయన ఉన్న ఈ విషయాన్ని చెబుతా. ఇది ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు ఫస్ట్ టైం ఇప్పుడే చెప్తున్నా.. చాలా మంచి వ్యక్తి.. దేవుడు నాకు ఒక గైడ్‌ను పంపించాడని నేను భావించా.. ఆయనతో కలిసి ఎన్నో యాత్రలు చేశా.. ఒకరి రూపాయి ఒక్కరు తినలేదు. ఆయన ఎవరి రూపాయి తినరు. ఎవరికీ పెట్టరు. ఆయన ఫ్యామిలీని మాత్రమే చూసుకుంటాడు అంటూ వివరించింది.

కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళే మేము పెళ్లి చేసుకోకుండా ఆపారంటూ జయలలిత సెన్సేషనల్ కామెంట్స్‌ చేసింది. చాలా ప్లాన్ చేసుకున్నామని.. బిడ్డను కూడా కనాలని భావించామని వివరించింది. కానీ ఆయన చాలా ఆలోచిస్తారు. రేపు నువ్వు, నేను చనిపోయాక ఆస్తి కోసం ఆ బిడ్డను ఏం చేస్తారో.. అని ఆయన అంటూ ఉండేవారని.. లలితా, లలితా అంటూ నన్ను పిలిచే వారిని వివరించింది. ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో త‌న తమ్ముడు నాతో క్లోజ్ గా ఉంటాడు.. వాళ్ళ అబ్బాయి కూడా నాతో మాట్లాడతారంటూ వివరించింది. ఏదేమైనా మనం అయితే ఓ వైపు విని జ‌డ్జ్ చేయలేము కదా.. రమాప్రభ, ఆయన విషయంలో ఏం జరిగిందో మనకు తెలియదు. నా విషయంలో మాత్రం ఆయన చాలా మంచి పర్సన్ అంటూ జయలలిత చెప్పుకొచ్చింది.