అయేషా ఖాన్.. ఈ పేరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. హిందీ బిగ్ బాస్ ద్వారా స్టార్డంను అందుకుని లైమ్ లైట్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట ఇన్స్టాగ్రామ్ లో తన సిజలింగ్ డ్యాన్స్, రిల్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందే సోషల్ మీడియాలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈ బ్యూటీ.. ఇటీవల తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది.
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలో నటించిన ఓం భీమ్ బుష్ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె గ్లామరస్ రోల్ లో మెప్పించింది. తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెరపై ఆయషా గ్లామర్ ప్రదర్శించడంతో కుర్రకారు ఆమెకు ఫిదా అయ్యారు. ఇక తాజాగా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ రావడం.. ఈమె నట్లతోపాటు సినిమాలో కామెడీ టైమింగ్ బాగా ఆకట్టుకుంటుందని.. సినిమా ఎంటర్టైన్ చేస్తుందని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
కాగా ఇప్పటికే గ్లామరస్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. దీనికి తోడు సిల్వర్ స్క్రీన్ పై కూడా ఆమె గ్లామర్ షోతో మెప్పించడంతో.. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. ఫ్యూచర్లో టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంటుంది అంటూ.. టాలీవుడ్కి మరో క్రేజీ బ్యూటీ దొరికేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆయేషా ఖాన్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఈమె మంచి క్రేజ్ సంపాదించుకోవడం ఖాయం అని సినీ పండితులు చెబుతున్నారు.