టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి కర్బంద హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. భోని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి కర్బంద.. తర్వాత పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అయితే ఆమెకు ఊహించిన రేంజ్లో సక్సెస్ రాలేదు. మొదట పవన్ కళ్యాణ్ తో కలిసి తీన్మార్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన కృతి కర్బందకు.. మంచి పాపులారిటీ దక్కింది. ఈ సినిమాతో కుర్ర కారు ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటి. ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని హీరోగా నటించిన ఒంగోలు గిత్త సినిమాలో నటించింది.
అలాగే రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమాలోని అతడి సోదరిగా నటించి మెప్పించింది. అలా ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన కృతి కర్బందా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. రెండు దశాబ్దాలు అవుతున్న సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడకపోవడంతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ను సంపాదించలేకపోయింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. గత ఆరు సంవత్సరాలుగా నటుడు పుల్కాత్ సామ్రాట్ తో ప్రేమలో ఉన్నట్టు ఇటీవల సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
పాగల్పంటి సినిమా టైంలో కలిసి వర్క్ చేసిన ఈ జంట.. తర్వాత ఒకరితో ఒకరు ప్రేమలో పడడం.. ఆరేళ్ల ప్రేమాయణం తర్వాత ఇటీవల పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రియుడి ఫోటోతో సహా.. అసలు విషయాన్నీ అనౌన్స్ చేసింది కృతి కర్బంద. ఇందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి తేదీని కూడా తెలియజేసింది. పుల్కిత్తో కలిసి మార్చి 13న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వివరించింది. పెళ్లి కార్డు షేర్ చేసిన కృత్తి వివాహ వేదికను మాత్రం రివీల్ చేయలేదు.