కొరటాల శివ చూస్ చేసుకునే హీరోయిన్స్ అందరిలోనూ ఆ క్వాలిటీ ఉంది.. మీరు గమనించారా..!!

కొరటాల శివ .. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఆచార్య సినిమా డిజాస్టర్ కాకుండా ఉంటే ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ పడని డైరెక్టర్గా చరిత్ర సృష్టిస్తుండేవాడు. కానీ ఆయన అదృష్టమో .. దురదృష్టమో ఆచార్య సినిమా పరమ చెత్త టాక్ సంపాదించుకుంది . మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు .

కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు కానీ .. ఆచార్య సినిమా మాత్రం డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో మెగా ఫాన్స్ కూడా మండిపడేలా టాక్ దక్కించుకునింది . దీంతో కొరటాల శివ ఖాతాలో ఫస్ట్ డిజాస్టర్ పడింది. అయితే కొరటాల శివ తన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీస్ లో హీరోయిన్స్ అందరి విషయంలో ఒక క్వాలిటీ కచ్చితంగా కనిపిస్తుంది . ప్రెసెంట్ అదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు జనాలు.

కొరటాల శివ సినిమాలో హీరోయిన్స్ అందరూ కూడా అటు ట్రెడిషనల్ పాత్రల్లోనూ ఇటు మోడ్రన్ పాత్రల్లోనూ సెట్ అవుతారు . కొరటాల శివ – ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన సినిమా మిర్చి. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించింది . అదేవిధంగా రీచా గంగోపాధ్యాయ్ కూడా నటించింది. ఇద్దరు కూడా అటు ట్రెడిషనల్ పాత్రలోనూ ఇటు మోడ్రన్ పాత్రలోనూ మెప్పించారు .

ఆ తర్వాత భరత్ అనే నేను సినిమాలో కీయరా అద్వానీ ట్రెడిషనల్ గా చీర కట్టి మెప్పించింది . జీన్స్ ప్యాంట్ వేసి మోడ్రన్ డ్రెస్ లోను మెప్పించింది . అంతేకాదు ఆచార్య సినిమాలో పూజా హెగ్డే ట్రెడిషనల్ పాత్రల్లో ఎంత ఆకట్టుకునిందో తెలిసిందే. అంతేకాదు పూజా హెగ్డే మోడరన్ లుక్ లోను బాగా బాగా మెరుస్తుంది. కాగా ఇప్పుడు దేవర సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్న జాన్వి కపూర్ కూడా అదే క్వాలిటీ ఉంది . ఆమె ట్రెడిషనల్ పాత్రలోను మెప్పిస్తుంది . మోడరన్ లుక్ లోను మెప్పిస్తుంది . ఇలా కొరటాల శివ తన సినిమాల విషయంలో చూస్ చేసుకునే హీరోయిన్స్ ట్రెడిషనల్ మోడరన్ గా ఉండే విధంగా చూస్ చేసుకుంటూ వస్తున్నాడు..!!