ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మల్టీ స్టారర్ ల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఇండస్ట్రీలో ఏదో మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ లో ఓ బ్లాక్ బస్టర్ కాంబోతో మల్టీస్టారర్ తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో హీరోగా టాలీవుడ్ గూఢాచారి అడవి శేష్ అలాగే సీతారామం మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నారట. రెండు భాషలకు చెందిన స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయడానికి మన మేకర్స్ కూడా ఇటీవల కాలంలో ఎంతో ఆసక్తి చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగులో ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్.. మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్, తెలుగు నుంచి అడవి శేష్ను కలిపి మల్టీ స్టారర్ సినిమా చేశారని.. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా దాదాపు ఫిక్స్ అయ్యాడని టాక్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పరుశురామ్ దగ్గర అసిస్టెంట్గా వ్యవహరించిన ఓ యంగ్ డైరెక్టర్ వీరిద్దరి కాంబో కోసం చక్కని కథను రాసుకున్నారట. ఇందులో మొదటి తెలుగులోనే ఇద్దరు హీరోలను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని భావించినా.. దీన్ని మల్టీ లాంగ్వేజ్ హీరోలాతో మల్టీ స్టారర్గా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట.
ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ హౌస్ ప్రయత్నాలను వేగవంతం చేసిందని.. ఇప్పటికే ఇద్దరు హీరోలకు కథ వినిపించడం జరిగిందని టాక్. వీరిద్దరూ ఎలా స్పందన కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఆడ విశ్, దుల్కర్ ఇద్దరు కూడా కథలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ.. ఇంపార్టెన్స్ ఉన్న సినిమా అనిపిస్తేనే నటిస్తూ ఉంటారు. కథలో కొత్తదనం కనిపిస్తే కచ్చితంగా ఈ సినిమాను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని తెలుస్తుంది. అలాంటి స్పెషల్ ఎలివేషన్స్ కథలో పుష్కలంగా ఉన్నాయట. ఇక దీంతో ఈ సినిమా పై ప్రేక్షకులో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ వార్తల నిజం ఎంత ఉందో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాలి.