పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎన్నో స్పెషల్ ఎలిమెంట్స్తో తెరకెక్కుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాజాగా ఓ అప్డేట్ నెటింట వైరల్గా మారింది. ఈ నెల 19న ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ డైలాగ్స్ తో ఈ ఈ గ్లింప్స్ రూపొందుతున్నాయని జోరుగా నెటింట ప్రచారం సాగుతుంది. ఇక మైత్రి మూవీ ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలతో స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో శ్రీ లీలా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రొడ్యూసర్స్ మీట్లో ఈ వీడియోను ప్లే చేస్తున్నారని సమాచారం.
ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందంటూ.. మరోపక్క వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి అప్డేట్ వస్తుందనే వార్త ప్రేక్షకులను ఫుల్ ఖుషి చేస్తుంది. మరోవైపు ఓజీ సినిమా నుంచి బాలీవుడ్ ప్రముఖనట్లు ఇమ్రాన్ హష్మీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఓజి మూవీ నుంచి కూడా గ్లింప్స్ రిలీజ్ కానున్నాయని ఆయన వివరించాడు. ఆ గ్లింప్స్ పవన్ పాత్రకు సంబంధించిన గ్లింప్సా.. లేదా ఇమ్రాన్ హష్మీ పాత్రకు సంబంధించిన గ్లింప్సా అనే విషయాన్ని మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు. నేను ఏ విషయాలు బయటకు చెప్పనని అయితే గ్లింప్స్ మాత్రం త్వరలోనే రిలీజ్ కానున్నట్లు ఇమ్రాన్ హష్మీ వివరించాడు.
ఓజి మూవీ నుంచి మరో గ్లింప్స్ రిలీజ్ అయితే ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నుంచి వరుసగా ఒకేసారి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రెండు గ్లింప్స్ రిలీజ్ అవుతున్నాయని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని సినిమాల తీయాలని.. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాలు రిలీజై బాక్సాఫీస్ షేక్ చేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా తెరకెక్కిస్తే ఇది నిజంగానే జరగడం ఖాయం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.