సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎవరైనా నటీ, నటులు లేదా హీరో, హీరోయిన్లు ఏదైనా క్యారెక్టర్ కు బాగా క్లికై.. ఆ క్యారెక్టర్ బాగా హైలైట్ అనిపిస్తే మళ్లీ వరుసగా అలాంటి క్యారెక్టర్ లోనే సినిమా ఆఫర్లు వస్తూ ఉంటాయి. అందులోనే పరిమితంగా చేయాల్సి వస్తుంది. అలా చాలామంది హీరోలు గాని, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఒకే రకమైన పాత్రలు కాకుండా డిఫరెంట్ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ అన్ని రకాల పాత్రలు పోషించే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే అందుతుంది. అలా ఒకసారి ఒక నటుడు ఏదైనా పాత్ర చేస్తే సరిగ్గా మళ్ళీ అలాంటి పాత్రే వాళ్లకు మిగతా సినిమాల్లో కూడా మేకర్స్ ఇస్తూ ఉంటారు.
ఇలాంటి క్రమంలో ఓ హీరోయిన్ కి వరుసగా సినిమాల్లో చనిపోయే క్యారెక్టర్లన్ని ఇస్తున్నారని ఆ కారణంతోనే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిందంటూ ఇంట్రెస్టింగ్ నకయూస్ వైరల్గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో కాదండి ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాలో, నాగార్జునతో మన్మధుడు సినిమాలో కలిసిన నటించిన అన్షు. ఈ రెండు సినిమాలతో ఆమె ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. రెండు సినిమాల్లోనూ ఆమె క్యారెక్టర్ చనిపోతుంది. ఇక రెండు సినిమాల్లో ఆమె క్యారెక్టర్ బాగా హైలైట్ అవ్వడంతో తనకు మరో రెండు సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్లే వచ్చాయట.
ఇక పదేపదే చనిపోయే క్యారెక్టర్లలోనే నటించాలంటే విసుగువచ్చిన ఆమె ఇంతకంటే ఖాళీగా ఇంట్లో ఉండడం బెటర్ అని తెలుగు ఇండస్ట్రీని వదిలేసినట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీకి దూరమైన తర్వాత పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఓ స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ఈమె సరైన క్యారెక్టర్లు తన వద్దకు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయిందన్న వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు.. చాలా నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా మేకర్స్ ఇండస్ట్రీలో నటీనటుల టాలెంట్ను బట్టి క్యారెక్టర్లు ఇస్తే బాగుంటుంది. ఒక క్యారెక్టర్ లో బాగా నటించారు కాబట్టి అదే క్యారెక్టర్ కి పరిమితం చేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ పలువురు సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.