బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బందాకు టాలీవుడ్ ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పలు సినిమాలో నటించి మెప్పించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు, తీన్మార్ లాంటి సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక బ్రూస్లీ సినిమాలో రామ్ చరణ్ కు అక్కగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కి చెకేసిన ఈ అమ్మడు.. 2019 నుంచి బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా వీరిద్దరి ప్రేమ వివాహారాన్ని వీరు కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. వారు పెళ్లికి అంగీకరించడంతో తాజాగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ బ్యూటీ ఎప్పుడెప్పుడు పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తుందా అంటూ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కృతి కర్బందా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేసుకుంది. పెళ్లి విషయంపై హింట్ ఇచ్చింది.
వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ దీనికి ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టింది. మార్చ్లో పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నట్లు హింట్ ఇచ్చింది. పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. ఐదేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్న ఇంత కామ్గా ఎఫైర్ నడిపిందా అంటూ షాక్ అవుతున్నారు. అయితే ఈ జంట ఎప్పుడెప్పుడు ఒకటవుతారో అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలో కృతి రిస్కీ రోమియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram