సమంత గురించి ఏమో అలా.. సాయి పల్లవి గురించి ఇలా.. హీట్ పెంచేస్తున్న ప్రియమణి చెల్లి మాటలు..!!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే శరణ్య ప్రదీప్ పేరు మారుమ్రోగిగిపోతుంది. ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్కగా నటించిన శరణ్య ప్రదీప్.. ఆ తర్వాత నుంచి తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అమ్మడు ఖాతాలో ఇప్పుడు పది సినిమాలకు పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్న శరణ్య ప్రదీప్ తాజాగా నటించిన భామ కలాపం 2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ సమంత హీరోయిన్ సాయి పల్లవిలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

శరణ్య .. సాయి పల్లవి తో ఫిదా అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత సమంతతో ఖుషి అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. రీసెంట్గా ఆమె అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీలో న్యూడ్ సీన్స్ లో కూడా నటించి మెప్పించింది. రీసెంట్ గా సోషల్ మీడియా లో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ” సమంత చాలా కూల్ చాల తక్కువగా మాట్లాడుతారు ..కానీ రిలేషన్ షిప్స్ కి చాలా వాల్యూ ఇస్తారు .. నాకు చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చింది. ఖుషి టైంలో నా బర్త్ డే వచ్చింది. దీంతో కాశ్మీర్లో నా బర్త్ డే ని సెలబ్రేట్ చేసింది. రెండు కాస్ట్లీ షాల్స్ హ్యాండ్ బ్యాగ్ బహుమతిగా ఇచ్చింది ..అవి నాకు ఎప్పటికీ స్పెషల్ ..అంతేకాదు సమంత నాకు బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయింది “అంటూ చెప్పుకొచ్చింది .

అదేవిధంగా సాయి పల్లవి గురించి మాట్లాడుతూ..” సాయి పల్లవి చాలా ఎమోషనల్.. ఫిదా సినిమాలో ఒక సీన్ చేసేటప్పుడు నిజంగానే ఏడ్చేసింది. చాలా చాలా సెన్సిటివ్ ..ఆ సీన్స్ ఇప్పుడు చూసినా మాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ..అప్పుడు అర్థమైంది సాయి పల్లవి ని ఎందుకు అందరూ పొగిడేస్తూ ఉంటారా ..? అనేది అంటూ చెప్పుకొచ్చింది”. ఇక ప్రియమణి విషయానికొస్తే ..”చాలా చిల్ అవుట్.. జోవియల్ భామ కలాపం 2 లో ప్రియమణి గారు నాతో అక్క లాగా ఉంటారు అని .. సెట్స్ లో ఇద్దరం చాలా అల్లరి చేసామని ఫన్నీగా ఉంటుంది అని .. చాలా బాగా ఎంజాయ్ చేశామని చెప్పుకొచ్చింది “. ప్రెసెంట్ శరణ్య ప్రదీప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్..!!