“మళ్లీ మంచి రోజులు వచ్చాయి ..ఐ యాం వెరీ వెరీ హ్యాపీ”.. సమంత జీవితంలో ఆనందం నింపింది ఎవరో తెలుసా..?

సమంత .. ఈ మధ్యకాలంలో బాగా బాధపడింది.. బాగా ఏడ్చింది.. బాగా సఫర్ అయింది. రీజన్స్ ఏవైనా కానీ సమంత బాధపడిన పిక్చర్స్ చూస్తుంటే ఇప్పటికీ అందరి కళ్ళల్లో నీళ్లు మెదలాడుతాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది . దానికి తగ్గట్టే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కూడా అటాక్ అయింది .

దీంతో ఆ జబ్బుకి ట్రీట్మెంట్ కోసం దేశ విదేశాలు తిరిగి ఫైనల్లీ ఆ జబ్బు ని కంట్రోల్లో పెట్టుకునింది . అయితే విడాకులు తర్వాత ఎప్పుడు కూడా ఆనందంగా లేని సమంత.. చాలా ఏళ్ల తర్వాత ఆనందంగా ఉన్నాను అంటూ పోస్ట్ పెట్టింది . సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. “చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నేను ఆనందంగా ఉన్నాను ..చిన్నప్పుడు స్కూల్ బుక్స్ చదివేదాన్ని ..ఏ సబ్జెక్టులో అయినా పరిశోధన చేయడం లీనమవడం నాకు చాలా ఇష్టం..”

“ఇప్పుడు మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను ..నా మనసు ఉప్పొంగిపోతుంది.. నా నోట్ బుక్ లో నిండిపోతున్నాయి.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ మీతో పంచుకుంటాను “అంటూ చెప్పుకు వచ్చింది . సమంత వారం రోజుల్లో హెల్త్ పాడ్ కాస్ట్ తో అభిమానులకు సర్ప్రైజ్ చేయబోతుందట. ఆరోగ్య సూత్రాలు – నియమాలు – హెల్త్ పై అవగాహన కల్పించేందుకు సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది..!!