టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది పూజ హెగ్డే. తెలుగులో బుట్ట బొమ్మగా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా ప్లాప్లు ఎదురవడంతో టాలీవుడ్ సినిమాలకు దూరమైంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలా అందరూ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసే ఈ బ్యూటీ.. తరచుగా అందాల ఆరబోత చేస్తూనే ఉంటుంది.
పొడుగు కాళ్లతో పూజా హెగ్డే చేపే మత్తు గ్లామర్ షో కి కుర్రాళ్ళు ఫిదా అయిపోతుంటారు. ఇక ఎప్పుడైనా సినిమాలకు బ్రేక్ దొరికిందంటే చాలు మాల్దీవులుకో, వెకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేసే ఈ ముద్దుగుమ్మ అక్కడ చేసే అల్లర్లు అంతా ఇంత కాదు. ఆ వెకేషన్స్ లో పూజ హెగ్డే చేస్తే గ్లామర్ ఫోటోషూట్స్ నెట్టింట మంటలు రేపుతూ ఉంటాయి.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో.. బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. చివరిగా సల్మాన్ ఖాన్ కిసికి బాయ్ కిసీకి జాన్ సినిమాలో నటించి మెప్పించింది. బాలీవుడ్ లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తున్న ఈ బ్యూటీ.. ఇటీవల గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఎల్లోసారిలో పెళ్లికూతురుల ముస్తాబై నిండు చీరకట్టుతో కుర్రాళను ఆకట్టుకుంది. చూడగానే చూడమచ్చటగా ఉందంటూ.. అందాల కుందనపు బొమ్మలా ఉందంటూ.. ఆమె అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.