టాలీవుడ్ లో పురుషాధిక్యత ఎక్కువ.. నేను చాలా స్ట్రగుల్స్ పేస్ చేశా.. నటి సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. రక్త చరిత్ర, రజనీకాంత్ కబాలి, బాలకృష్ణ లెజెండ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ.. పలు తెలుగు వెబ్ సిరీస్లలో కూడా ఘాటు అందాలతో మైమరిపించింది. తన అద్భుత నటనతో ఆకట్టుకున్న ఈమె.. స్త్రీ స్వేచ్ఛ, పురుషాదిక్యంపై స్వతంత్రంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు హేతుబద్ధ విషయాలపై, మహిళా సంక్షేమంపై పోరాడుతూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కావడంతో ఎప్పటికప్పుడు పలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉండే ఈ బ్యూటీ గతంలో ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది.

ఆమె ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. ఆ ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమపై రాధిక సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆమెపై వ్యతిరేకత ఏర్పడింది. రాధిక ఆప్టే మాట్లాడుతూ నేను టాలీవుడ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఆ పరిశ్రమ చాలా పితృ సౌమ్య పురుషాధిక్య పరిశ్రమ.. అది అసలు భరించలేము.. మహిళలను చూసే విధానం సినిమాల్లో వారి పాత్రలకు ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా వీక్ గా ఉంటాయి.. సెట్లో మమ్మల్ని మూడో వ్యక్తిగా భావిస్తారు అంటూ చెప్పుకొచ్చింది.

ఇతర నటీనటులు ఎవరిని అడగకుండా వారి ఫిజికల్ స్టేటస్ ను బట్టి షూటింగ్ కూడా ఎప్పటికప్పుడు రద్దు చేసేస్తూ ఉంటారు. ఈ కారణంగా నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేశా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో సోషల్ మీడియాలో టాలీవుడ్ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. రాధిక ఆప్టే కొన్నాళ్ల క్రితం రాజీవ్ మా ఆనంద్ మ‌సంద్‌తో ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వివరించగా.. వాటిపై అప్పట్లో బోలెడంత రచ్చ జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ క్లిప్ ని వైరల్ చేస్తూ ఆమె ఇటీవల కాలంలో నటించిన బోల్డ్ సన్నివేశాలను, వలువల్లే లేకుండా నటించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఇలాంటి ఆమె తెలుగు పరిశ్రమ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుందా అంటూ తిట్టిపోస్తున్నారు.