అనసూయ చేసిన ఆ ఒక్క పని వల్ల.. రష్మి అన్ని ప్రాబ్లమ్‌స్ ఫేస్ చేసిందా..?

ఇండస్ట్రీలో టాప్ యాంకర్స్ ఎవరు అంటే ముందుగా అందరు చెప్పే పేరు సుమ. ఆ తర్వాత మాత్రం అందరికీ గుర్తొచ్చే రెండు పేర్లు అనసూయ – రష్మి . ఇద్దరికీ ఇద్దరే టాప్ యాంకర్లు . ఎలాంటి షోనైనా హోస్ట్ చేసే సత్తా ఉన్న టాలెంట్ ఉన్న యాంకర్స్. అనసూయ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు రష్మీ కూడా అనసూయని మించిపోయే రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోవడానికి కారణం ఈ జబర్దస్త్ షో నే. కాగా జబర్దస్త్ షో స్టార్టింగ్ లో అనసూయ 12 ఎపిసోడ్లు చేసి 13వ ఎపిసోడ్ కి కొన్ని కారణాల చేత తప్పుకుంది .

ఆ మూమెంట్లో వేరే ఎవ్వరు కూడా జబర్దస్త్ ని హోస్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడే తన పేరు పాపులారిటీ చెందుతూ వచ్చింది. పలు సీరియల్స్ ద్వారా తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న రష్మిని జబర్దస్త్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అయితే ఆమె ఓపెన్ గా నాకు తెలుగు రాదు అనే విషయాన్ని చెప్పేసింది. కానీ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ మేనేజ్ చేద్దాము నో ప్రాబ్లం అంటూ సపోర్ట్ చేసింది . అనుకున్న విధంగానే రష్మీ కెరియర్ సూపర్ సక్సెస్ అయింది . అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మీ జబర్దస్త్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న ట్రోలింగ్ పై ఎమోషనల్ అయింది .

అనసూయ లో ఎక్స్పెక్ట్ చేసిన రష్మీ యాంకరింగ్ ఆ స్థాయిని అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ” తెలుగు రాదు ..నీ ఫేస్ కి ఈ షో అవసరమా ..? అంటూ ఆమెను చాలా మంది ట్రోల్ చేశారట. ఆ ట్రోలింగ్ బాధలు తట్టుకోలేక ఏడ్చేసిందట . నేను షో చేయను అంటూ మల్లెమాల వాళ్ళకి చెప్పేసిందట . కానీ మల్లెమాల వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో ఆమెకు సపోర్ట్ చేశారట. కెరియర్ స్టార్టింగ్ లో ఇవంతా కామన్ మంచి టాలెంట్ ఉంది సక్సెస్ అవుతావు అంటూ సపోర్ట్ చేశారట . ఆరోజు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఇప్పుడు రష్మీకి వెయ్యి ఏనుగుల బలంగా మారింది. ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ యాంకర్ గా ఆయన ఇండస్ట్రీలో ఉంది అంటే కారణం జబర్దస్త్ షో అని చెప్పక తప్పదు . కెరియర్ స్టార్టింగ్ లో పరోక్షకంగా అనసూయ వల్ల ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది రష్మీ అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!