“ఎంత ట్రై చేసినా.. అది మాత్రం హైలెట్ కావడం లేదు”.. మళ్లీ అదే మేటర్ ని గెలికిన అనసూయ..!

అనసూయ .. ఈ మధ్యకాలంలో ఆమె ఏం మాట్లాడినా అది పెద్ద హైలెట్గా మారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అనసూయ ఫోటోషూట్ చేసిన తప్పే.. భర్తతో ఎక్కడికైనా కలిసి వెళ్లిన తప్పే .. ఆఖరికి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్న కూడా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . అనసూయ ఎటువంటి మోడ్రన్ డ్రెస్ వేసిన బూతు పదాలతో ట్రోల్ చేసే జనాలు ..ఆమె పద్ధతిగా గుడికి చీర కట్టుకొని వెళ్తే మాత్రం ఆ విషయాన్ని హైలెట్ చేయరు. అందులో కూడా నెగెటివిటీని చూస్తూ ఉంటారు .

ఇది చాలా సందర్భాలలో మనం చూసాం . అయితే రీసెంట్ గా అలాంటి వాటిపై అనసూయ స్పందించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ తాజాగా అభయ ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్నారు . చాలా భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేయించారు . పట్టుచీరలో అనసూయ చాలా పద్ధతిగా కనిపించింది . పూజ అనంతరం మీడియాతో మాట్లాడిన అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

 

“తాను రెగ్యులర్గా గుడి కి వెళ్తూ ఉంటాను అని ..పూజలు హోమాలు చేస్తూ ఉంటాను అని .. దేవుడిని బాగా గట్టిగా నమ్ముతాను అని చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఇలాంటివి కాకుండా ఏవేవో వైరల్ అవుతూ ఉంటాయి అని కూడా చెప్పుకోరావడంతో అక్కడ ఉండే వాళ్ళు షాక్ అయ్యారు . అంతేకాదు ఆలయాలకు వెళ్తున్నాను అని చెప్పుకోవాల్సిన అవసరం తనకు అనిపించడం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు “. దీంతో అనసూయ మాట్లాడిన మాటలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ప్రెసెంట్ అనసూయ పలు సినిమాలలో కీలకపాత్రలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది..!!