టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న దట్ ఇజ్ మహాలక్ష్మి మూవీ థియేటర్లోకి కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయి 8 ఏళ్ల అవుతున్నఇప్పటివరకు ఈ మూవీ రిలీజ్ చేయలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను నేషనల్ అవార్డ్ దక్కించుకున్న కంగనారనౌత్ బాలీవుడ్ మూవీ క్వీన్ ఆధారంగా తెరకెక్కించారు. 2014లో ఈ సినిమాను షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
2016లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిన ఇప్పటివరకు సినిమాను రిలీజ్ చేయలేదు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. కాపీ రైట్ప్ విషయంలో వచ్చిన వివాదాల కారణంగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఇక షూటింగ్ అయిన తరువాత రిలీజ్కు ఇంత గ్యాప్ రావడంతో దర్శకుడు, హీరోయిన్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆ సినిమా గురించి మర్చిపోయారు.
ప్రస్తుతం ఓటీటీలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ చేయాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నెట్ఫ్లిక్స్తో నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. త్వరలోనే దట్ ఇజ్ మహాలక్ష్మి ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లియరెన్స్ కూడా రానుంది. ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ కీరోల్ ప్లే చేశాడు.