వాట్.. పరమశివుడికి చెల్లెలు ఉందా.. ఆమెను పార్వతి దేవి అందుకే దూరం పెట్టిందా..?

త్రిమూర్తులలో ఒకరైన శివుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సృష్టి, లయ, స్థితి కారకుల్లో చివరి వారు శివుడు. లయ అంటే అన్నిటిని ఆయన కలుపుకుంటారు. అందుకే ఆయనని లయ కారకుడని పిలుస్తుంటారు. అలాగే శివుడిని..భోళా శంకరుడు అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన భక్తుల కోరిన కోరికలను వెంటనే తీరుస్తాడు కాబట్టి.

ఇక శివుడికి ఒక చెల్లి కూడా ఉందని విషయం ఎవరికీ తెలియదు. శివుడి చెల్లె పేరు దేవి అశావరి. ఇక ఆమె గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని కైలాసానికి వచ్చాక అక్కడ ఆమె కాపురం పెట్టింది. అయితే అక్కడ ఆడవారు ఉండరు. అందరూ మగవారే ఉంటారు. కైలాసంలో పార్వతీకి ఎవరైనా మహిళ తోడుగా ఉంటే బాగుంటుందని పార్వతి శివుడిని అడగగా.. శివుడు తనలాగే ఉండే దేవి అశావరిని సృష్టిస్తాడు.

దేవి అశావరి శివుడు లాగే పులి చర్మం ధరించి ఉంటుంది. జుట్టు విరబోసుకుని ఉంటుంది. అలాగే కళ్లు పగిలి ఉంటాయి. చూడటానికి అశావరి వేషం బాగుండదు. దీంతో పార్వతి అశావరి నీ అందంగా తయారు చేస్తుంది. ఆమెకి విపరీతమైన తిండి యావ. పార్వతి కైలాసంలో ఉన్న ఆహారం మొత్తాన్ని ఆమెకు పెడుతుంది. అయినప్పటికీ అశావరి ఆకలి తీరదు. దీంతో పార్వతి విసిగిపోయి తన గోడును శివుడికి చెప్పుకుంటుంది. ఇక దీంతో శివుడు అశావరిని వేరే ప్రదేశానికి పంపించేస్తాడు. ఈ విధంగా శివుడికి ఒక చెల్లెలు ఏర్పడింది.