మెగా హీరో వరుణ్ తేజ్, స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీలో ఘనంగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ ముద్దుగుమ్మ వ్యవాహిక జీవితంలోనికి అడుగుపెట్టి.. మెగా ఇంటి కోడలు అయింది. ఇక గతేడాది వైవాహి జీవితంలోకి అడుగుపెట్టిన లావణ్య ఈ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. తన న్యూ ఇయర్ రిజర్వేషన్లను సోషల్ మీడియా వేదికగా వివరించింది.
మెగా కోడలు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేసింది. అంతేకాకుండా 2024 అయినా తన న్యూ రిజల్యుషన్స్ ఇలా ఉండబోతున్నాయంటూ షేర్ చేసుకుంది. కొత్త ఏడాదిలో మరింత మానవత్వంతో ఉండాలని తనపై తనకు మరింత ప్రేమ, అలాగే సోషల్ మీడియాకు తక్కువగా.. నేచర్ తో మమేకమై పోవాలని కోరుకుంటున్నట్లు వివరించింది.
ఇక మొదట్లో బాలీవుడ్ సీరియల్ యాక్టర్ ప్యార్ క బంధం తో బుల్లితెరపై మెప్పించిన లావణ్య త్రిపాఠి.. 2012లో అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో నటించింది. ఈ సినిమాల షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.