ఇండియాకి సేఫ్ గా చేరాను అంటూ ఆందోళనలో పోస్ట్ పెట్టిన తారక్.. ఎందుకంటే…!

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ నటనతో ఎంతో అభిమానులను దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్నటువంటి మూవీ ” దేవర “. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాపై తారక్‌ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే తారక్ రీసెంట్ గానే వెకేషన్ కోసం జపాన్ దేశం వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఊహించని విధంగా భూకంపాలు మొదలయ్యి జపాన్ దేశాన్ని కుదిపేసాయి. దీంతో అక్కడ తీవ్ర నష్టం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మరో పక్క ఎన్టీఆర్ తన కుటుంబంతో అక్కడే ఉన్నాడన్న మాట అభిమానులలో టెన్షన్ పుట్టించింది.

ఇక తాజాగా తారక్ తన విషయంలో అప్డేట్ అందించాడు. తాను ఇండియాకి సేఫ్ గా చేరుకున్నానని తెలిపాడు. కానీ జపాన్ కి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది అని.. తిరిగి వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపాడు తారక్. ఇక ప్రస్తుతం తారక్ ఇచ్చిన అప్డేట్ తో ఈయన ఫ్యాన్స్ రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.