“ఎన్టీఆర్ నిక్కసైన మగాడు ..నిజాయితీపరుడు”.. అని చెప్పడానికి ఈ ఒక్క న్యూస్ చాలదా…!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో జపాన్ వెళ్ళాడు . హ్యాపీగా అక్కడ న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో పకడ్బందీగా ముందు నుంచే ప్లాన్ వేసుకుని వెళ్ళాడు . అంతే కాదు న్యూ ఇయర్ తర్వాత వారం రోజులు అక్కడే ఉండాలి అంటూ రూమ్స్ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నాడు .

అనుకున్న విధంగానే న్యూ ఇయర్ ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే తారక్ అనుకున్న దానికంటే ముందే ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది . కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా తారక్ కొద్ది గంటల క్రితమే ఇండియాలో అడుగు పెట్టాడు . అయితే ప్రజెంట్ జపాన్ లో సిచువేషన్ ఎలా ఉందో మనకు తెలిసిందే . వరుస భూకంపాలతో అల్లకల్లోల పరిస్థితి నెలకొంది . ఒకవేళ నిజంగా తారక్ అక్కడే ఉండి ఉంటే తారక్ చాలా చిక్కుల్లో పడేవాడు .

అంతేకాదు తారక్ ను ఆ దేవుడే ఇండియాకు రప్పించాడు అని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు తారక్ సైతం దీనిపై ఎమోషనల్ గా స్పందించాడు . “జపాన్ లో ఉండే ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి దేవుడు అంటూ ప్రశాంతంగా ఉండండి అంటూ ట్విట్ చేశారు”. కాగా నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ నిజాయితీపరుడు అని ..ఎవరికి చెడు చేయలేదు అని అందుకే దేవుడు ఈ విధంగా ఆయనను కాపాడి ఇండియాకి తీసుకొచ్చాడు అని .. ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం” అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు..!