సాధారణంగా చాలామంది కీరదోసనే తింటూ ఉంటారు. ఇది తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు సైతం తగ్గుతాయి. అంతేకాకుండా బరువు అదుపులో సైతం ఉంటుంది. ఇక ఈ కీర దోస తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కీరదోసులో విటమిన్ ఏ, కె, సి పుష్కలంగా ఉంటాయి.
తద్వారా మనం బాడీకి కావాల్సిన విటమిన్లు అందుతాయి. వీటిలో 95% వరకు నీరు ఉంటుంది. కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీర దోసలో ఉండే క్యాల్షియం ఎముకుల పుష్టికి సహాయపడుతుంది. కిడ్నీలు మరియు మెదడు పనితీరుకు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి ఈ కీరదోస.
వీటిలో ఉండే పీచు పదార్థం పేగు కదలికను మెరుగుపరిచి మలబద్దకం తగ్గిస్తుంది. అలాగే డయాబెటిస్తో బాధపడేవారు కీరదోస తినడం వల్ల డయాబెటిస్ తగ్గుతాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తద్వారా మనకి ఎటువంటి అనారోగ్య సమస్య ఏర్పడదు. అందువల్ల కనీసం రోజుకో కీరా దోసకాయని తినడం అలవాటు చేసుకోండి.