టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఇద్దరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగాస్టార్గా మారాడు చిరంజీవి. నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాతకు తగ్గ మనవడిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత 20 సంవత్సరాల క్రితం చిరంజీవి – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రావాల్సిన ఓ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు ఆవుల గిరి అనే నైజం డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూస్ చేయడానికి రంగాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. చాలామంది రైటర్లను కూర్చోబెట్టి స్క్రిప్ట్ మీద పనిచేస్తారు. అయినా ఈ సినిమా స్క్రిప్ట్ మాత్రం ఓ కొలికి రాకపోవడం, ఇక సినిమాను ఫుల్ మాస్ సినిమాగా తెరకెక్కించాలని అనుకున్న కథ అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాకపోవడం, దాన్ని డీల్ చేసే డైరెక్టర్ కూడా దొరకకపోవడంతో.. ఈ ప్రాజెక్టును గిరి పక్కన పెట్టేసారట. అయితే తర్వాత ఈయన ప్రొడ్యూసర్ గా మారి కొన్ని సినిమాలుకు ప్రొడ్యూస్ చేసిన ఆ సినిమాలో ఏది సక్సెస్ కాలేదు.
దీంతో ఇండస్ట్రీ నుంచి గిరి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక చిరు – ఎన్టీఆర్ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఏదేమైనా ఆ కాంబినేషన్ వర్కౌట్ కాకపోయినా.. దర్శకధీరుడు రాజమౌళి చాలువతో త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్.. చిరు తనయుడు రామ్ చరణ్ కలిసి మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అలాగే ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.