మిల్కీ బ్యూటీ తమన్న ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన సంగతి తెలిసిందే. సౌత్ స్టార్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ సత్తా చాటింది. అయితే ఇటీవల తమన్నకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ క్రేజీ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్లతో బిజీగా గడుపుతుంది.
టాలీవుడ్ లో ఎప్పుడు హద్దులు దాటి నటించని తమన్న.. బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత ఇంటిమేట్ సీన్స్ చేయడంలోనూ బౌండరీలను క్రాస్ చేసింది. నటన విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. సౌత్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రాకపోయినా కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుంటూ ఆస్తులను రెట్టింపు చేసుకుంటుంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ ఆస్తుల విలువ గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ.. సినిమాల అవకాశాలు రాకపోయినా యాడ్లు చేస్తూ రెమ్యూనరేషన్ భారీగా గడిస్తుంది. కేవలం ఒక్క యాడ్ ప్రమోషన్కు కోటి రూపాయల రెమ్యునరేషన్ను డిమాండ్ చేస్తుందట తమన్న. ఇక సినీ ఇండస్ట్రీ గురించి పక్కన పెడితే తమనకు సొంత జ్యువెలరీ బిజినెస్ ఉన్న సంగతి తెలిసిందే. జ్యువెలరీ బిజినెస్ ఆధారంగా కూడా భారీగానే సంపాదిస్తుందట. ఇక తమన్నాఇప్పటివరకు రూ.120 కోట్ల వరకు ఆస్తులను గడించినట్లు తెలుస్తుంది.