“చేసిందంతా చేసేసి ఇప్పుడు సారి చెప్తున్నావా..?”.. సందీప్ రెడ్డి వంగా పై గుర్రుగా స్టార్ హీరోయిన్ ..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డి వంగ అన్న పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనం చూస్తున్నాం వింటున్నాం . మరి ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా రాకముందు ఈయన పేరు ఎవరికి తెలిసేది కాదు . ఈయన పేరు చెప్తే ఆలోచించడానికి పది నిమిషాలు గ్యాప్ తీసుకునే వాళ్ళు జనాలు . అలాంటిది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అనగానే అరుపులు కేకలతో రచ్చ రంబోలా చేసేస్తున్నారు .

దానికి మెయిన్ రీజన్ ఆయన తెరకెక్కించిన సినిమాలే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డివంగా రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ రెడ్డివంగా పరిణితి చోప్రా కు సారీ చెప్పారు. యానిమల్ సినిమాలో ఆమెనే మొదట హీరోయిన్గా అనుకున్నామని అంతా ఫిక్స్ చేసుకున్నామని..

లాస్ట్ లో గీతాంజలి పాత్రకు ఆమె సెట్ కాదు అని తెలిసి రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నామని ఈ విషయం తెలిసి ఆమె చాలా బాధపడిందని .. ఆ బాధకు కారణం నేనే కనుక సారీ చెప్తున్నాను అంటూ ఓపెన్ గానే ఆమెకు క్షమాపణలు చెప్పాడు . అయితే దీనిపై పరిణితి చోప్రా ఫ్యాన్స్ మండిపడుతున్నారు . చేసిందంతా చేసేసి ఇప్పుడు సారీ నా..? దేనికి పనికొస్తుంది ఈసారి అంటూ సందీప్ రెడ్డి పై ఫైర్ అవుతున్నారు..!!