” వెంకీ 75 ” మూవీస్ కంప్లీట్ అయిన సందర్భంగా అలాంటి సెలబ్రేషన్స్… ఇదేం పండగ రా బాబు..!

టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది విక్టరీ వెంకటేష్. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాలను తీస్తూ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు వెంకీ. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సొంతం చేసుకున్న ఈయన.. అనంతరం వరుస విజయాలతో దూసుకుపోయాడు.

ఇక వెంకీ తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న కెరీర్ 75వ మూవీ ” సైంధవ్ “. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ త్రిల్లర్ మూవీ జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. కెరీర్ పరంగా 75 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా విక్టరీ వెంకటేష్.. ఈనెల 27న గ్రాండ్ గా స్పెషల్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు.

ఇక ఈ సెలబ్రేషన్ ఫంక్షన్ హైదరాబాదులోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 5 గంటల నుంచి గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఇక ఈ ఫంక్షన్కు టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులతో పాటు వెంకటేష్ 75 సినిమాల్లో పనిచేసిన నిర్మాతలు, దర్శకులు కూడా విచ్చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ స్పెషల్ ఫంక్షన్ గురించి పూర్తి వివరాలు అతీత్వరలోనే వెలుగులోకి రానున్నాయి.