“కోట్ల ఆస్తి ఉన్నా..ఆ బాధ అందరికి ఒక్కటే”..అభిమానులను కంట తడి పెట్టిస్తున్న నమ్రత పోస్ట్..!!

సృష్టిలో అమ్మ ప్రేమ ముందు ఏది ఎక్కువ కాదు అంటూ ఉంటారు జనాలు . అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఒప్పుకోవడమే చాలా కష్టం . ఎలాంటి వారైనా సరే స్టార్ సెలబ్రిటీ కావచ్చు హౌస్ వైఫ్ కావచ్చు తమ బిడ్డలపై చూపించే ప్రేమ ఒకేలా ఉంటుంది . రీసెంట్గా మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తన కొడుకు గౌతమ్ ని తలుచుకొని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది .

మనకు తెలిసిందే మహేష్ బాబుకు ఇద్దరు పిల్లలు . ఒకరు సితార రెండు గౌతమ్ . ఇద్దరు కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు . కాగా తాజాగా తన కుమారుడు పై నమ్రత చేసిన పోస్ట్ అభిమానులను ఎమోషనల్ కి గురిచేస్తుంది . పై చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది .

నమ్రత పోస్ట్ చేస్తూ..”గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నారు. నీ హార్డ్ వర్క్ ఫ్యాషన్ సంకల్పం చూస్తుంటే గర్వంగా ఉంది . అవే నీకు ఇంత మంచి రోజులు తీసుకొచ్చాయి . నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి అంటూ చాలా ఎమోషనల్ గా” పోస్ట్ రాసుకొచ్చింది. కారులో కొడుకుతో ఉన్న ఫోటోలు కూడా షేర్ చేసింది. ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారింది. అంతేకాదు చాలామంది జనాలు నమ్రత కు సపోర్ట్ చేస్తున్నారు . ఎంత కోట్ల ఆస్తులు ఉన్నా స్టార్ సెలబ్రిటీవైనా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమేగా ఆ బాధ అందరికీ కామన్ .. కొడుకులు పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతి తల్లి ఇలాగే బాధపడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)