“ఒక్కోక్కడి పులుసు కార్చేసే సీన్ అదే”.. నా సామీ రంగా రెబల్ అభిమానులకు ఇక నిద్రపట్టదు..!!

సలార్.. సలార్.. సలార్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారు మ్రోగిపోతుంది . ఏ రాష్ట్రమైనా ఏ కులమైనా ఏ మతమైనా అందరి నోట వినిపిస్తున్న పేరు ఇదే . మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా అస్సలు చెప్పలేకపోతున్నాం. హై రేంజ్ లో చెవులు మూతలు పడిపోయేలా ప్రభాస్ పేరును జపిస్తున్నారు అభిమానులు .

కాగా సినిమా ప్రమోషన్స్ కోసం దర్శకధీరుడు  రాజమౌళి కూడా రంగంలోకి దిగారు . పృథ్వీరాజ్ – ప్రభాస్ – ప్రశాంత్ నీల్ ను తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేశారు . ఈ ఇంటర్వ్యూలో  రాజమౌళి శృతిహాసన్ కి సంబంధించిన ప్రశ్న వేశాడు.  ట్రైలర్ షాట్ లో  ఆమె ఒక్కటంటే ఒక్కచోటే కనిపిస్తుంది . మరి సినిమాలో అయినా పూర్తిగా కనిపిస్తుందా ..? అంటూ అడిగాడు . దానికి ప్రభాస్ ఘాటైన ఆన్సర్ ఇచ్చాడు.

ఈ సినిమాలో శృతిహాసన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని .. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలలోకి ఇది చాలా చాలా పేరు తీసుకొచ్చి పెడుతుంది అని.. మరీ ముఖ్యంగా తనకు తన తల్లికి శృతిహాసన్ కి మధ్య వచ్చే సీన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని థియేటర్స్ లో విజిల్స్ మోగాల్సిందే అంటూ కూసింత ఘాటుగానే ఆన్సర్ ఇచ్చాడు.  అంతేకాదు సినిమాలో పృథ్వీరాజ్ – ప్రభాస్ ల  మధ్య వచ్చే ఫైట్ సీన్స్ చూస్తే ఒక్కొక్కడికి పులుసు కారిపోయే రేంజ్ లోనే ఉండే విధంగా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్ అంటూ  మేకర్స్ కూడా అభిమానులకు నిద్ర పట్టని నటువంటి హై రేంజ్ ఆశలు పెంచేశారు..!!