” ఆ స్టార్ హీరో లేకపోతే నేను హిమాలయాలకు వెళ్లిపోయే వాడిని “.. వెంకీ సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా కెరీర్ లో 75 సినిమాలు పూర్తి చేసుకోవడంతో హైదరాబాద్ లో గ్రాండ్ గా ఓ ఫంక్షన్ జరుపుకున్నాడు. ఈ ఈవెంట్ కి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అలాగే ఈయన 75 సినిమాలు తెరకెక్కించిన దర్శకులు, ప్రొడ్యూసర్లు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్లో వెంకటేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకీ మాట్లాడుతూ…” మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే సినిమాలు మానేసి.. హిమాలయాలకు వెళ్లి ఉండేవాడిని.

9 సంవత్సరాల తరువాత విరామం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150 తో బ్లాక్ బస్టర్ అందించడం చూసి ఈయన నటన కొనసాగించాలని కోరుకున్నాను ” అంటూ వెంకీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా వెంకీ ” సైంధవ్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై వెంకటేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.