టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథా నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. డాన్సర్ గా, సింగర్ గా, యాక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుని మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీగా మారింది. గతంలో కొంత కాలం వ్యక్తిగత కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. సెకండ్ ఇన్నింగ్స్ లో అంతే స్పీడ్ గా పాపులారిటి సంపాదించుకుంది. ఈ ఏడాది తెలుగులో వరుస సక్సెస్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వేరేసింహారెడ్డి రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది.
నాని హాయ్ నాన్న స్పెషల్ సాంగ్ లో నటించగా.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సలార్ సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో శృతిహాసన్ జర్నలిస్ట్ గా కనిపించబోతుందట. ఇదిలా ఉంటే శృతిహాసన్ ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శృతిహాసన్ మాట్లాడుతూ జీవితంలో మళ్లీ నేను మందు జోలికి పోనని.. నేనెప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్లలేదని.. డ్రగ్స్, పార్టీల కల్చర్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. గతంలో నాకు డ్రింకింగ్ అలవాటు ఉండేదని.. శృతిహాసన్ వివరించింది.
మందు తాగడంలో ఎలాంటి ఆనందం లేదనే విషయం నాకు ఇటీవలే అర్థమైందని.. అప్పటినుంచి అలవాటు దూరంగానే ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. గత 8 ఏళ్లగా మద్యపానానికి ఆమె దూరంగా ఉంటుందట. పార్టీలకు, మందుకి దూరమైనందుకు నాకు కొంచెం కూడా బాధ లేదు. ఇప్పుడు ఎలాంటి హ్యాంగ్ ఓవర్స్ లేవు. జీవితం ప్రశాంతంగా సాగుతుంది అంటూ శృతిహాసన్ వివరించింది. మళ్లీ జీవితంలో ఎప్పుడు మందు మొట్టనని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.
తాగడం మానేశాక పార్టీలని, ఫ్రెండ్స్ ని అవాయిడ్ చేయడం కష్టంగా మారిందని.. తాగడం అలవాటు ఉన్నా తను ఎప్పుడు డ్రగ్స్ జోలికి మాత్రం వెళ్ళలేదంటే చెప్పుకొచ్చింది శృతిహాసన్. ప్రస్తుతం శృతిహాసన్ డ్రగ్స్, మద్యంపై చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో శృతిహాసన్కు గతంలో మందు అలవాటు ఉండేదా అంటూ షాక్ అవుతున్నారు.