ఒక్కే వేదికపైకి చిరు-బాలయ్య-నాగ్-వెంకీ.. ఫ్యాన్స్ కి అద్దిరిపోయే ట్రీట్‌ రెడీ..ఎప్పుడు..? ఎక్కడంటే..?

అబ్బబ్బ.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ – అక్కినేని నాగార్జున – విక్టరీ వెంకటేష్ ఈ నలుగురు కూడా మళ్లీ ఒకే స్టేజిపై కనిపించబోతున్నారా..? అంటే ఎస్ అంటున్నారు అభిమానులు . టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వీళ్ళకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నలుగురు కూడా తోపైన హీరోలే ఇండస్ట్రీని ఓ స్ధానం లో నిలబెట్టారు .

అలాంటి ఈ నలుగురు ఒకే స్టేజిపై మెరవడం చాలా చాలా రేర్. అలాంటి ఓ మూమెంట్ రాబోతుంది అంటూ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన సినిమా సైంధవ్. ఆయన కెరియర్ లోనే 75వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కడం విశేషం . శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. రేపు హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుంది .

కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరు – బాలయ్య నాగ్ లను ఇన్వైట్ చేశారట . అంతేకాదు తన 75వ మూవీ ఎప్పటికీ గుర్తుండిపోవాలని క్రేజీ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేశారట. దీంతో ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే మరి కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే..!!