బిగ్ బ్రేకింగ్: శోక సంద్రలో నిండిపోయిన సినీ ఇండస్ట్రీ..ప్రముఖ యాంకర్ ఇంట్లో తీవ్ర విషాదం..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి . ఒక స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న విషాదఛాయలు మరవక ముందే మరో స్టార్ సెలబ్రిటీ మరణిస్తూ ఉండడం అభిమానులకు తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది . రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న గాయత్రి భార్గవి తండ్రి మరణించాడు . ఈ విషయం యాంకర్ ఝాన్సీ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసుకొచ్చింది .

గాయత్రి భార్గవి పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ డైరెక్టర్ బాపు గారి మనవరాలుగా బాగా సుపరిచితురాలు . అంతేకాదు యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పలు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అంతేకాదు సిస్టర్ – వదినా క్యారెక్టర్స్ ప్లే చేస్తూ అభిమానులను అలరించింది . ప్రతిరోజు పండగే , బింబిసారా అలాంటి హిట్ సినిమాల్లో కూడా నటించి సినిమా హిట్ అవ్వడానికి తనవంతు కృషి చేసింది .

కాగా గాయత్రి వాళ్ళ నాన్నగారు సూర్యనారాయణ శర్మ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది . డాక్టర్స్ ఎంత ట్రై చేసినా పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది . గాయత్రీ భార్గవి కి పలువురు సినీ స్టార్స్ సెలబ్రిటీస్ ధైర్యం చెప్తున్నారు . గాయత్రి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. గాయత్రికి తండ్రి లేని లోటు ఎవ్వరు తీర్చలేనిది..!!