అయిపోయింది .. కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటివరకు ప్రేమ పక్షులుగా తిరిగిన వీళ్ళు ఇకపై భార్యాభర్తలుగా తిరగబోతున్నారు . వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వరుణ్ తేజ్ లావణ్య పెళ్లిలో మెగా ఫ్యామిలీ ఓ ఫోటో దిగింది .
ఈ ఫోటోలో చిరంజీవి – నాగబాబు – పవన్ కళ్యాణ్ మెగా ఆడపడుచులు కనిపిస్తున్నారు . అయితే ఈ ఫోటోలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మిస్ అయింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఆమె మరి ఎవరో కాదు అంజనమ్మ. చిరంజీవి తల్లి . ఈ ఫోటోలో ఆమె ఉండి ఉంటే ఇంకా హైలైట్ గా ఉండుండేది అంటూ చెప్పుకొస్తున్నారు.
ఆమె ఆరోగ్యం బాగోలేని కారణంగా ఇటలీకి ఆమెను తీసుకువెళ్లలేదు. మొదట నిజంగానే ఆమెను ఇటలికి తీసుకువెళ్లాలనుకున్నారట. కానీ డాక్టర్స్ అందుకు ఒప్పుకోలేదట . అందుకే ఆమెను హైదరాబాదులోనే ఉంచి మెగా ఫ్యామిలీ ఇటలీ బయలుదేరాల్సి వచ్చింది . ప్రెసెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!