బాలీవుడ్ అయితే అలా.. టాలీవుడ్ అయితే ఇలా.. రష్మిక కొత్త రూల్స్ వింటే మైండ్ దొబ్బాల్సిందే..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎలా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పుష్ప సినిమా హిట్ అయిన తర్వాత రష్మిక మందన రేంజ్ మరింత స్థాయిలో పెరిగిపోయింది . అంతేనా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే రష్మిక మందన్నాను తెగ లైక్ చేస్తున్నారు జనాలు ..ఆమె ఫ్లాప్స్ పడుతున్న సరే ఆమెకే ఆఫర్లు ఇస్తున్నారు .

ఈ క్రమంలోనే రష్మిక మందన్నా తన సినిమాలకు పెట్టే కొత్త కండిషన్ ఇప్పుడు వైరల్ గా మారింది . తెలుగు డైరెక్టర్స్ కి ఒకలా బాలీవుడ్ డైరెక్టర్స్ కి మరోలా రష్మిక కండిషన్స్ పెడుతుందట. తెలుగు డైరెక్టర్స్ మొదట కాల్ షీట్స్ అడిగి ఆ తర్వాత ఎప్పటికి ఆ డేట్స్ ఫీల్ చేసుకుంటారు అని.. బాలీవుడ్ డైరెక్టర్స్ అయితే ఏ రోజు డేట్ ఆ రోజే అడుగుతారు .. ఆ రోజే ఫిల్ చేసుకుంటారు అని ..

అందుకే తెలుగు డైరెక్టర్స్ కి రష్మిక ముందే ఇచ్చిన కాల్ షీట్స్ డేట్ ప్రకారమే ఫాలో అవుతాను అంటూ తెగ్గేసి చెప్తుందట . ఆ తర్వాతే అడ్వాన్స్ రెమ్యూనరేషన్ డబ్బులు కూడా తీసుకుంటుందట . మొత్తానికి రష్మిక మందన్నాకి తెలుగు డైరెక్టర్స్ పై అంత నమ్మకం కుదిరింది అనమాట..!!