బుల్లితెరపై కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 బుల్లితెరపై ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ను ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇక ఉల్టా పల్టా కాన్సెప్ట్తో రిలీజ్ అయిన ఈ సీజన్లో ఎన్నో సర్ప్రైజ్లు, ట్విస్ట్లు, డిఫరెంట్ కంటెంట్ను బిగ్ బాస్ ప్రవేశపెట్టాడు. ఇక ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. దీంతో ప్రేక్షకుల్లో ఉన్న కొద్ది బిగ్ బాస్ హౌస్ బాయ్స్ హాస్టల్ లో తయారవుతుంది అంటూ కామెంట్స్ వినిపించాయి.
దీంతో తాజాగా జరిగిన ఎలిమినేషన్స్లో ఈ రికార్డును బ్రేక్ చేస్తూ మొదటిసారిగా మెయిల్ కంటిన్యూస్టెంట్ అయినా సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ లో నాగార్జున ఎలివేషన్ల గురించి మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యాడు. వీళ్ళ ఎలిమినేషన్లకు కారణం ఒక్కడేనంటూ నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి సందీప్ స్టేజ్ పైకి వచ్చేసిన తర్వాత నాగార్జున మాట్లాడుతూ సందీప్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం నువ్వే తేజ.. ఈ వారం సందీప్ని నువ్వు నామినేట్ చేశావు. సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. గతవారం పూజని నామినేట్ చేసావ్ పూజ ఎలిమినేట్ అయింది.
ఆ ముందు వారం నాయని పావనిని అలాగే నామినేట్ చేశావు తను కూడా ఎలిమినేట్ అయిపోయింది అంటూ కామెంట్ చేశాడు. నాగార్జున చేసిన కామెంట్స్కి తేజ చాలా బాధపడ్డాడు. తర్వాత దానిపై స్పందించిన నాగార్జున మాట్లాడుతూ నేను జోక్ చేశాను.. తేజ ఎలిమినేషన్స్ అనేవి ప్రజల చేతిలో ఉంటాయి. నువ్వు నామినేట్ చేశావు కాబట్టి వాళ్లు ఎలిమినేట్ అవ్వలేదు.. ప్రజలే వాళ్ళని ఎలిమినేట్ చేశారు. యు డోంట్ వర్రీ అంటూ చెప్పకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏది ఏమైనా టేస్టీ తేజ రీజన్ లేకుండా చేసిన చెత్త నామినేషన్ వల్లే వీళ్ళ ముగ్గురు నామినేషన్లోకి వచ్చి ఎలిమినేట్ అయ్యారు అంటూ నెట్టిజన్స్ తేజ పై ఫైర్ అవుతున్నారు.