“అప్పటి రివేంజ్..ఇప్పుడు తీర్చుకుందా..?”.. సురేష్ కొండేటి పై వరలక్ష్మిది ఏళ్లనాటి పగా..?

సురేష్ కొండేటి .. ఒకప్పుడు అంటే ఏమో తెలియదు కానీ .. ఈ మధ్యకాలంలో ఈ పేరు తరచూ మనం వింటూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో సురేష్ కొండేటి అనే పేరు రకరకాలుగా ట్రెండ్ అవుతూ ఉంటుంది.  ఏ సినిమా రిలీజ్ అయిన సరే హీరో హీరోయిన్ల పేర్లు కంటే ముందు సురేష్ కొండేటి పేరే మనకు యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది.  రీసెంట్గా సురేష్ కొండేటి పై వరలక్ష్మి శరత్ కుమార్ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది .

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన మెన్షన్ 24 హౌస్ సిరీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది.  దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఓ ప్రెస్ మీట్ ని అరేంజ్ చేశారు . ఈ క్రమంలోనే సురేష్ కొండేటి మైక్ తీసుకొని ” మీరు దెయ్యాలను నమ్ముతారా..?” అన్న ప్రశ్న వేశారు.  వరలక్ష్మి శరత్ కుమార్ “ఎస్ నమ్ముతాను” అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు “మీరు దయ్యాలని ఇష్టపడతారా ..?” అన్న ప్రశ్న వేయగానే ఒళ్ళు మండిపోయిన వరలక్ష్మి ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది .

“ఏం క్వశచన్స్ అడుగుతున్నారండి ..? ఎవరైనా దెయ్యాలని ఇష్టపడతారా..? అసలు ఇలాంటి ప్రశ్న ఎలా అడుగుతారు..?” అంటూ ఫైర్ అయిపోయింది . అయితే ఇది ఈరోజు కోపం కాదు అని గతంలో ఆమె నటించిన సినిమా విషయంలో ఇలాగే ప్రెస్ మీట్ లో సురేష్ కొండేటి ఆమెను పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేసారని.. అప్పట్లో పెద్దగా పాపులారిటీ లేని వరలక్ష్మి చాలా సైలెంట్ గా ఆయన ప్రశ్నలను భరించింది అని.. ఇప్పుడు క్రేజ్ రావడంతో ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవడంతో ఒక్కసారిగా అప్పటి బాకీ ఇప్పుడు తీర్చేసింది అని.. ఇచ్చి పడేసింది అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . మొత్తానికి అలా ఆ విధంగా వరలక్ష్మి ..సురేష్ పై రివెంజ్ తీర్చుకుందన్నమాట అంటూ ఫ్యాన్స్ సైతం సురేష్ కొండేటిని ట్రోల్ చేస్తున్నారు..!!