మన టైం బాగో లేకపోయినా.. దరిద్రం మన పక్కనే ఉన్న.. శని మన నెత్తి మీద తాండవం చేస్తున్న ..మనకు తెలియకుండా మనమే మన లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం . అలాంటి ఓ టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేసింది కీర్తి సురేష్ అన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ మహానటిగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ మహానటి కొన్ని సినిమాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఫ్యాన్స్ కి సైతం నచ్చలేదు .
రీసెంట్గా ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నేను శైలజ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా కీర్తి సురేష్ ..ఆ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ..వెంటనే ఓ జాక్పాట్ ఆఫర్ వచ్చింది. అయితే అప్పట్లో ఎలాంటి సినిమాలు చూస్ చేసుకోవాలో తెలియక ఆ సినిమాను మిస్ చేసుకుంది.
ఆ సినిమా మరేదో కాదు జనతా గ్యారేజ్ . ఎన్టీఆర్ సెకండ్ హీరోయిన్ గా అమ్మడు ఈ సినిమాలో ఆఫర్ వచ్చింది. అయితే అప్పుడే అంత పెద్ద ఆఫర్ రావడంతో కంగారు పడిపోయి ..సెకండ్ హీరోయిన్ రోల్స్ చూస్ చేసుకోకూడదు అన్న టెన్షన్లో అమ్మడు ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఈ పాత్ర నిత్యామీనన్ కి చేరింది. ఒకవేళ ఈ సినిమాలో ఈ పాత్ర కీర్తి చేసుంటే మాత్రం ఇప్పుడు రష్మికను మించిపోయిన హీరోయిన్ అయి ఉండేది అన్న కామెంట్స్ వైరల్ అవుతుంది..!!