ఫిదా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే తెలంగాణ యాసలో మెప్పించిన సాయి పల్లవి కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. ఈ మూవీలో డీ గ్లామరస్ రోల్లో నటించిన సాయి పల్లవి ఎప్పుడు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కదల ఎంపిక విషయంలో ఆలస్యం చేస్తూ వస్తుంది ఈ బ్యూటి. గార్గి సినిమా తరువాత సాయి పల్లవి ఇప్పటివరకు స్క్రీన్ పై కనిపించలేదు.
తాజాగా శివ కార్తికేయన్ హీరోగా, కమలహాసన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో భారీ ప్రాజెక్టులో సాయి పల్లవి నటిస్తుందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సీత పాత్ర కోసం సాయి పల్లవి ఎంపికైందంటూ న్యూస్ వినిపించింది. తాజాగా ఈ వార్త స్పందించిన నాచురల్ బ్యూటీ మాట్లాడుతూ నాకు ఈ క్యారెక్టర్ నిజంగా ఓ సవాల్ అని త్వరలోనే ఈ కథను వినటానికి ముంబై వెళ్ళుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
రామాయణంలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నానని.. ఇందులో చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారని.. వారిలో పది శాతం నేను నటించిన చాలంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సాయి పల్లవి మాట్లాడిన ఈ మాటలతో రామాయణంలో సీత క్యారెక్టర్ లో సాయి పల్లవి పిక్స్ అయిందని అంశంపై క్లారిటీ వచ్చింది. దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.