“అందుకే నడిచి వెళ్లిందా..?” ..త్వరలోనే బన్నీ భార్య స్నేహ రెడ్డి గుడ్ న్యూస్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్య రీసెంట్గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు ఫ్లైట్లో కారులో వెళ్లే స్నేహ రెడ్డి ఈసారి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళింది .

అంతేకాదు మెట్టు మెట్టు కి పసుపు కుంకుమ కర్పూరం హారతి పెడుతూ దైవస్మరణతో ఎంతో పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా కనిపించింది . ఆ లుక్స్ కి అభిమానులు సైతం ఫిదా అయిపోయారు . అయితే సడన్గా వెకేషన్ నుంచి రాగానే ఇలా ఆమె శ్రీవారిని దర్శించుకోవడం వెనక ఓ గుడ్ న్యూస్ ఉంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

త్వరలోనే రీసెంట్గా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వరించింది . దీనికోసం మొక్కు తీర్చుకున్న స్నేహ రెడ్డి.. త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని.. ఆ గుడ్ న్యూస్ చెప్పడానికి శ్రీవారిని దర్శనం చేసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. చూదాం మరి దీని పై బన్నీ భార్య ఎలా స్పందిస్తుందో..?