బన్నీకి కత్తిలాంటి ఫిగర్ ని సెట్ చేసిన త్రివిక్రమ్.. ఇక రచ్చ రంబోలానే..!!

అబ్బబ్బా.. ఇది కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకునేది . ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేసిన ఒక క్రేజీ కాంబో సెట్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ప్రెసెంట్ పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్న అల్లు అర్జున్ త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని చూస్ చేసుకున్నాడట మాటల మాంత్రికుడు.

 

దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి సెలెక్ట్ అయిన సాయి పల్లవి తన రెండో తెలుగు ప్రాజెక్టును ఫైనలైజ్ చేసేసింది . మొత్తానికి బన్నీ – సాయి పల్లవి తెరపై కనిపిస్తే చూడాలి అని కోట్లాదిమంది ఫాన్స్ వెయిట్ చేశారు . అలాంటి ఓ కాంబోని సెట్ చేశాడు త్రివిక్రమ్.

ఇక రచ్చరంబోలానే ..అంటున్నారు జనాలు. వీళ్లిద్దరూ డాన్స్ ఎంత బాగా ఇరగదీస్తారో ప్రత్యేకంగా చెప్పాలా..? ..ఇప్పటి వరకు బన్నీ-సాయి పల్లవి తెర పై కనిపించిందే లేదు. ఒక్క వేళ్ల వీళ్లు కలిసి నటిస్తే అది అభిమానులకి పెద్ద పడగనే చెప్పాలి..!!