బిగ్ బాస్ 7: ఆరో వారం ఇంటి బాట ప‌ట్ట‌బోతున్న స్టార్ సెల‌బ్రిటీ.. ఇది పెద్ద షాకే!

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రంజుగా సాగుతోంది. గత నెలలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన సీజన్ 7 నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం ఎండింగ్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపారు. దీంతో షో చాలా రసవత్తరంగా మారింది.

 

కొత్త కంటెస్టెంట్స్ కు, పాత కంటెస్టెంట్స్ కు మధ్య పోటీలు పెడుతూ బిగ్ బాస్ ఆటను రోజురోజుకు ఇంట్రెస్టింగ్ గా మార్చేస్తున్నారు. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే.. ఆరో వారం అమర్ దీప్, శోభా శెట్టి,యావర్, పూజా మూర్తి, అశ్విని, టేస్టీ తేజ, నయని పావని, సందీప్‌ నామినేషన్స్ లో వ‌చ్చారు. వీరిలో సందీప్ ను సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన గౌతమ్ బిగ్ బాస్ ఇచ్చిన స్పెష‌ల్ ప‌వ‌ర్ తో సేవ్ చేసేశాడు.

మిగిలిన ఏడుగురిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఆరో వారం ఓ స్టార్ సెల‌బ్రిటీ ఇంటి బాట ప‌ట్ట‌బోతున్నారు. ఇంత‌కీ ఆ సెల‌బ్రిటీ మ‌రెవ‌రో కాదు శోభా శెట్టి. నామినేష‌న్స్ లో ఉన్న వారిలో యావ‌ర్‌, అమ‌ర్ దీప్, టేస్టీ తేజ టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్నారు. అశ్విని శ్రీ, పూజా మూర్తి, నయని పావని కూడా బాగానే ఓట్లు సంపాదించుకున్నారు. అంద‌రికంటే శోభా ఓటింగ్ లో వెన‌క‌ప‌డింది. దీంతో ఆమెనే ఆరో వారం బిగ్ బాస్ హౌస్ ను వీడ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మైతే ఆమె ఫ్యాన్స్ కు పెద్ద షాకే అవుతుంది.