రైతే రాజు.. నేను కూడా రైతు బిడ్డనే.. అమర్ ని ట్రోల్స్ చేయొద్దు తల్లి ఎమోషనల్ కామెంట్స్ వైరల్..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ రసవతరంగా సాగుతుంది. ఇక ఈ షోలో కంటెస్టెంట్‌గా బుల్లితెర హీరో అమరదీప్ కూడా పాల్గొన్నారు. ఎన్నో సీరియల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడంతో ఇతనే టైటిల్ కొట్టేస్తాడు అంటూ అంద‌రు భావించారు. అయితే ఈయన హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చే టాస్కులపై ఏమాత్రం కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. దీంతో క్రమక్రమంగా అమ‌ర్‌పై అంచనాలు తగ్గిపోయాయి. అలాగే హౌస్ లో పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేయడం ఎవరికీ నచ్చలేదు. ఇలా అమ‌ర్‌ వ్యవహార శైలి కారణంగా చాలా నెగెటివిటీ ఎదుర్కొన్నాడు.

అమర్ ప్రతి విషయంలో గొడవకు దిగడంతో చాలామంది నేగెటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. తనను వెంటనే బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేయాలంటే కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అమర్ గురించి నేగెటివ్ కామెంట్స్ రావడంతో తన తల్లి సోషల్ మీడియా వేదికగా కుమారుడు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. సోషల్ మీడియాలో తన కొడుకు గురించి చాలామంది ట్రోల్స్ చేస్తున్నారని.. దయచేసి ఇలాంటి ట్రోల్స్ ఆపేయండి నా కొడుకు మంచివాడు కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు నా కొడుకు కూడా చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడ్డాడు అని చెప్పుకొచ్చింది.

తను ఎంతో మంచివాడు.. అద్భుతమైన నటుడు.. అద్భుతమైన డ్యాన్సర్ కూడా.. కొందరు తనని టార్గెట్ చేసి తప్పుగా కామెంట్లు చేస్తున్నారు. దయచేసి ఎవరు అలా చేయకండి అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇక పల్లవి ప్రశాంత్ గురించి నా కొడుకు తప్పుగా ప్రవర్తించాడు. నా కొడుకు రైతులకు ఎంతో మంచి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని రైతు ఎప్పటికీ రాజు. అమర్ తండ్రి కూడా ఒక మెకానిక్ మేము కూడా ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే అంటూ కామెంట్స్ చేసింది. తన కొడుకు పై వచ్చిన కామెంట్లకు స్పందిస్తూ ఈమె ఎమోషనలైన‌ ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.