మగధీర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన కన్నీళ్ళు పెట్టుకుని బాధపడిన రాజమౌళి..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నా.. యంగ్ డైరెక్టర్లు ..స్టార్ డైరెక్టర్లు ..పాన్ ఇండియా వైడ్ గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బ్లాస్టింగ్ హిట్స్ అందుకున్న డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అయితే ఎంతమంది ఎంత ట్రై చేసినా సరే దర్శకధీరుడు రాజమౌళి స్టామినాను ..స్టేటస్ను అందుకోలేకపోతున్నారు. అందరూ డైరెక్టర్లు సినిమాలు తీస్తారు.. కానీ రాజమౌళి జనాల నాడి పట్టుకుని సినిమా తీస్తాడు.. జనాలకు ఏ విధంగా నచ్చుతుందో ..వాళ్ళ జోనర్ లో ఆలోచించి ..మరి సినిమాలను తెరకెక్కించడం రాజమౌళికి అలవాటు .

కాగా ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా మగధీర . ఈ సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటించగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది . 2009లో జులై 30వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది . మొత్తం 40 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని కోట్లు లాభాలు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తీసుకొచ్చిన రాజమౌళి కన్నీళ్లు పెట్టుకున్నారట . ఫుల్ సాటిస్ఫై అవ్వలేదట. హీరో నటనపరంగా ఓకే అనిపించిన తాను అనుకున్న హీరో ఈ సినిమాలో నటించలేకపోయాడు అంటూ బాధ పడ్డారట . ఎస్ నిజానికి మగధీర సినిమాను రాజమౌళి బాలకృష్ణతో తెరకెక్కించాలనుకున్నారట. గతంలో రెండు సార్లు ఆఫర్ వచ్చినట్లే వచ్చి మిస్ అయిపోయింది అని ..ఈసారి మిస్ కాకూడదు అంటూ ఎంతో పకడ్బందీగా ఆయనకు నచ్చే విధంగా స్క్రిప్ట్ రాసుకొని వెళ్లారట . కానీ బాలయ్యే ఈ సినిమా యంగ్ హీరోస్ తో చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేయడంతో మరో మాట చెప్పలేకపోయారట . కానీ రాజమౌళి ఈ సినిమాలోని సీన్స్ అన్ని బాలయ్యతోనే ఊహించుకున్నారట. అందుకే ఆయన ఎమోషనల్ గా ఈ సినిమాకి కనెక్ట్ అవ్వలేకపోయారు అని అప్పట్లో ప్రచారం జరిగింది..!!