వైసీపీ గుర్తు ‘సైకిల్’..ఇదెక్కడి ట్విస్ట్.!

వైసీపీ గుర్తు సైకిల్..అదేంటి అది టి‌డి‌పి గుర్తు కదా..వైసీపీ గుర్తు ఫ్యాన్ కదా..అని అందరికీ తెలుసు. కానీ అందరికీ అంటే ఏపీలో ఓటర్లు మొత్తానికి కాదనే చెప్పాలి. ఎందుకంటే కొందరికి గుర్తులు తెలియడం లేదట. మన గుర్తు ఏది అని వైసీపీ నేతలు ప్రజలని అడుగుతుంటే సైకిల్ అని చెబుతున్నారట. అంటే ప్రజలకు వైసీపీ గుర్తుపై ఇంకా పూర్తి అవగాహన రాలేదని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు.

ఒక కార్యక్రమంలో మంత్రి..అక్కడ ఉన్న మహిళని మన గుర్తు ఏది అంటే సైకిల్ అని చెప్పేసింది. దీంతో మంత్రి షాక్ అయ్యారు. కాదు కాదని అని ఫ్యాన్ అంటూ కాస్త సీరియస్ గానే చెప్పారు. అయితే మరోసారి అలాంటి సంఘటనలే పునరావృతం అవుతున్నాయని ధర్మాన అంటున్నారు. మన గుర్తు ఏది అంటే సైకిల్ అంటున్నారని, ఫ్యాన్ గుర్తుపై కొందరికి అవగాహన ఉండటం లేదని చెప్పుకొస్తున్నారు. గుర్తుపై అవగాహన కల్పించాలని చెబుతున్నారు. వాస్తవానికి 40 ఏళ్ల పైనుంచి టి‌డి‌పి ప్రజలకు తెలుసు. సైకిల్ గుర్తు జనంలో నాటకుపోయింది. అటు కాంగ్రెస్ గుర్తు హస్తం సైతం ప్రజలకు బాగా తెలుసు.

ఇక 13 ఏళ్ల పార్టీ అయినా వైసీపీ గుర్తు ఫ్యాన్ అనే అవగాహన ఉంది. కాకపోతే కాస్త మారుమూల గ్రామాల్లో కొంతమందికి తెలియడం లేదని చెబుతున్నారు. అందుకే గుర్తుపై అవగాహన కల్పించాలని ధర్మాన అంటున్నారు. అప్పుడే ప్రజలకు గుర్తులపై కన్ఫ్యూజన్ ఉందని చెబుతున్నారు.