పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరికొద్ది రోజుల్లో `సలార్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 28న వివిధ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాడు.
ఇప్పటికే పోస్ట్ ప్రొడెక్షన్ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి. ప్రమోషన్స్ ను షురూ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో సలార్ ట్రైలర్ ను ముంబై వేదికగా విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇకపోతే సలార్ కి పాన్ వరల్డ్ స్థాయిలో బీభత్సమైన హైప్ క్రియేట్ అయింది. ఒక్క అమెరికాలోనే అడ్వాన్స్ బుకింగ్ లో 5 లక్షల డాలర్లు దాటిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ హైప్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.
గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ `కబాలి` సినిమాకు కూడా ఇలానే ఓవర్ హైప్ ఏర్పడింది. కానీ, ఆ తర్వాత ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఇప్పుడు ఎలాంటి అప్డేట్స్ రాకుండానే సలార్ సినిమాపై కూడా ఎక్కడ్లేని అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా ఎక్కువగా వస్తున్నహైప్ వల్ల సినిమాకి ఏమైనా మైనస్ అవుతుందా? అని డార్లింగ్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. ఒకవేళ అంచనాలు అందుకోవడంలో సలార్ విఫలం అయితే.. ప్రభాస్ కు మళ్లీ డిజాస్టరే అని చర్చించుకుంటున్నారు.